శని-వక్రగతి-శాంతి-హోమం
ఇప్పటివరకు 500+ భక్తులు మా ద్వారా నిర్వహించిన పూజలలో పాల్గొన్నారు.
బుకింగ్ ముగిసే సమయం
పూజ గురించి
🪐 శని వక్రగతి తీవ్ర దోష నివారణా మహాయజ్ఞం: ద్వాదశ రాశుల వారికి అభయం!
జూలై 27 నుండి డిసెంబర్ 10 వరకు శని దేవుని వక్ర సంచారం – శని దోష పరిహారార్థం ప్రత్యేక జప, హోమ క్రతువులు!
సమస్త ప్రాణికోటికి వారి వారి కర్మానుసారంగా ఫలాలను ఇచ్చే శనిభగవానుడు జూలై 27 నుండి డిసెంబర్ 10 వరకు వక్రగతిలో సంచరిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడు వక్రించినప్పుడు అతని దృష్టి అత్యంత తీవ్రంగా ఉంటుంది. ఈ కాలంలో 12 రాశుల (ద్వాదశ రాశుల) వారు ఎంతో కొంత ప్రతికూల ఫలితాలను, రకరకాల సమస్యలను మరియు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
⚠️ శని వక్రగతి వల్ల కలిగే ప్రధాన సమస్యలు:
ఈ శని వక్రగతి ప్రభావం వల్ల మీ జీవితంలో కింద తెలిపిన తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది:
* ఆర్థిక & వ్యాపార సమస్యలు: తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు (రుణ బాధలు), వ్యాపారాల్లో అనుకోని నష్టాలు.
* ఆరోగ్యం & ప్రమాదాలు: తీవ్ర అనారోగ్య సమస్యలు, శస్త్ర చికిత్సలు (ఆపరేషన్లు), వాహన ప్రమాదాలు జరిగే సూచనలు.
* ఉద్యోగ & విదేశీ ప్రయాణ భంగాలు: ఉద్యోగం ఊడిపోవడం లేదా ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడి, విదేశాల్లో ఉద్యోగం చేసే వారికి తీవ్ర సమస్యలు, విదేశీ ప్రయాణాలు వాయిదా పడటం.
* కుటుంబ & మానసిక అశాంతి: కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు/పోట్లాటలు, ప్రేమికుల మధ్య బ్రేకప్లు (విడిపోవడం), మనశ్శాంతి కోల్పోవడం.
* కోర్టు & భూ వివాదాలు: అకారణంగా గొడవలు రావడం, కోర్టు కేసుల వేధింపులు, భూమి/ఆస్తి వివాదాలు తలెత్తడం.
🛡️ ఈ తీవ్ర శని దోషాల నుండి తృణప్రాయంగా బయటపడటం ఎలా?
జ్యోతిష్య శాస్త్రం మరియు ధర్మసింధు ప్రకారం శనిదేవుని ఆగ్రహం లేదా వక్ర దృష్టి నుండి రక్షణ పొందడానికి శాంతి జపాలు, తైలాభిషేకాలు మరియు హోమాలు మాత్రమే అత్యుత్తమ మార్గాలు. శని వక్రగతి వల్ల వచ్చే దోషాలన్నీ తొలగిపోయి, శుభ ఫలితాలు కలగడానికి మా పీఠం/ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
ప్రయోజనాలు
నష్టాల నివారణ & అద్భుత వ్యాపార వృద్ధి
ద్వాదశ రాశుల వారికి శని వక్రగతి దోషం తృణప్రాయంగా తొలగిపోతుంది.
ఆర్థిక ఇబ్బందుల
ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభించి, అప్పుల బాధలు తీరుతాయి.
ఆరోగ్య సమస్యలు
ఆరోగ్య సమస్యలు తొలగి, ఆయురారోగ్యాలు, ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది.
కుటుంబంలో సంతోషం,
కుటుంబంలో సంతోషం, భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగి శాంతి చేకూరుతుంది
ప్రక్రియ
శ్రీ విఘ్నేశ్వర పూజ
ఏ పూజ లేదా కార్యక్రమం ప్రారంభించినా ఎటువంటి అడ్డంకులు కలగకుండా, విజయవంతంగా పూర్తవ్వడానికి ముందుగా విఘ్నేశ్వరుడిని ఆరాధించడం మన సాంప్రదాయం. ఈ హోమంలో కూడా తొలిగా గణపతిని ఆవాహన చేసి, షోడశోపచార పూజలు నిర్వహిస్తారు. ఈ ప్రథమ పూజ వల్ల మన మనస్సులోని సంకల్పానికి బలంతో పాటు, తలపెట్టిన హోమ ప్రక్రియ అంతా నిర్విఘ్నంగా నెరవేరడానికి శ్రీ గణపతి అనుగ్రహం లభిస్తుంది.
మండప ఆరాధన
విఘ్నేశ్వర పూజ అనంతరం ప్రధాన హోమ క్రమం కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన మండపంలో దేవతలను ఆవాహన చేస్తారు. వివిధ దిక్కులకు అధిపతులైన దిక్పాలకులు, గ్రహ దేవతలు మరియు శని నిమండపంలో ప్రతిష్ఠించి ఆరాధిస్తారు. ఈ మండప ఆరాధన ద్వారా హోమ ప్రాంగణమంతా దివ్యమైన మంత్రశక్తితో, సానుకూల తరంగాలతో (Positive Energy) నిండిపోయి ఆవరణ శుద్ధి జరుగుతుంది.
మూలమంత్ర జపం
హోమానికి ముందు లక్ష్మీ గణపతి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధించడం కోసం వేద పండితులచే శక్తివంతమైన శని మూలమంత్ర జపం' జరుగుతుంది. బీజాక్షరాలతో కూడిన ఈ మూలమంత్రాన్ని నిర్దిష్ట సంఖ్యలో జపించడం వల్ల వాతావరణంలో అపారమైన ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమవుతుంది. ఈ జప ప్రక్రియ వల్ల శని మరియు నవగ్రహాల కటాక్షం లభించి, సంకల్ప సిద్ధి త్వరితగతిన లభిస్తుంది.
అభిషేకం
తైల భిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత, దేహ దార్ఢ్యం, సకల పాప నివారణ మరియు శని అనుగ్రహంతో కుటుంబంలో శుభాలు కలుగుతాయి.
హోమము
శని కి ఈ నువ్వుల హోమం చేయడం వల్ల సమస్త విఘ్నాలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు, వ్యాపార వృద్ధి, రుణ విముక్తి మరియు సకల ఐశ్వర్య ప్రాప్తి శీఘ్రంగా సిద్ధిస్తాయి.
ఆలయం
మీకు లభించేవి
- మీ గోత్రనామాలతోటి సంపూర్ణ హోమ ప్రక్రియ అంతా కూడా చేయించడం జరుగుతుంది
- చేతికి కట్టుకోవడానికి రక్ష , ఆశీర్వచన అక్షతలు కుంకుమ , డ్రై ఫ్రూట్స్ ప్రసాదం కొరియర్ లో పంపించడం జరుగుతుంది
ప్రశ్నలు
ఈ పూజలో ఎవరు పాల్గొనవచ్చు
వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడేవారు, రుణ బాధలతో ఇబ్బంది పడేవారు.
ఈ పూజలో స్వయంగా వచ్చి పాల్గొనవచ్చా
అవును మీరు కావాలంటే వెదురుపాక గ్రామం, రాయవరం మండలం ,తూర్పుగోదావరి జిల్లా, శ్రీ గాయత్రి పీఠానికి స్వయంగా వచ్చి పూజ చూడవచ్చు ,కానీ పూజ అంతా బ్రాహ్మలే చేస్తారు.